వీరి కుమారుడి సమస్య.. వాళ్లకు వరమైంది
సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఎడంచేతివాటమున్న వాళ్లు కాస్త ప్రత్యేకం. వస్తువులను కుడిచేతి వాళ్లు పట్టుకున్నట్లుగా ఎడంచేతివాటం వాళ్లు పట్టుకోలేరు. ముఖ్యంగా పెన్నుతో కుడిచేతి వాటం ఉన్నవాళ్లు రాసినంతా వేగంగా.. ఎడం చేతివాటం వారు రాయలేరు. ఇలాంటి ఇబ్బంది
(ఫొటో: ది లెఫ్ట్ హ్యాండ్ షాప్ ఫేస్బుక్)
ఇంటర్నెట్ డెస్క్: సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఎడమ చేతివాటమున్న వాళ్లు కాస్త ప్రత్యేకం. ముఖ్యంగా పెన్నుతో కుడిచేతి వాటం ఉన్నవాళ్లు రాసే మాదిరిగా ఎడం చేతివాటం వారు రాయలేరు. ఇలాంటి ఇబ్బంది గురీందర్సింగ్ అనే బాలుడికి ఐదేళ్ల కిందట మొదలైంది. అతడు ఐదో తరగతి చదువుతున్నప్పుడు టీచర్లు నోట్స్ చెప్పే సమయంలో వేగంగా రాయలేక ఇబ్బంది పడ్డాడు. దీంతో చదువుపై ఆసక్తి తగ్గిపోయింది. అతడిలో సమస్య ఎక్కడుందో తల్లిదండ్రులు సందీప్, పవీత్తర్ గుర్తించారు. దేశంలో ఎడమ చేతివాటం వాళ్లకు ప్రత్యేక పెన్నులు పెద్దగా అందుబాటులో లేవని గుర్తించి వారే స్వయంగా ఒక స్టార్టప్ ప్రారంభించారు. ఎడమ చేతివారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన పెన్నులుతోపాటు అనేక వస్తువులను తక్కువ ధరకు ఆన్లైన్లో అమ్ముతూ దేశంలో ఈ తరహా తొలి స్టోర్ ప్రారంభించినవారిగా గుర్తింపు పొందారు.
అన్ని పెన్నులు.. కుడిచేయితో రాసేవారికి అనుగుణంగా ఉంటాయి. ఎడంచేతివాటం వాళ్లు ఆ పెన్నులతో రాస్తున్నప్పుడు ముందు పదాలను చూడలేరు. దీంతో రాయడంలో వెనుకబడుతుంటారు. ఇదే సమస్యతో గురీందర్ సింగ్ బాధపడ్డారు. నిజానికి ఇలాంటి వారి కోసం విదేశాల్లో ప్రత్యేక పెన్నులు ఉన్నాయి. పెన్ను పట్టుకునే చోటులో ఎడంచేతివాటం వాళ్లకు అక్షరాలు కనిపించేవిధంగా కాస్త వొంపు ఉంటుంది. చాలా మందికి వీటి గురించి తెలియదు. అయితే, వారి కుమారుడికి ఇలాంటి పెన్ను కొనివ్వాలని భావించారు. కానీ, వాటి ధర రూ.వేలల్లో ఉండటం చూసి కంగుతిన్నారు. దేశీయంగా పెన్నుల తయారీ కంపెనీల వద్దకు వెళ్లి సంప్రదిస్తే.. డిమాండ్ ఉంటేనే తయారు చేస్తామని చెప్పారు. దీంతో వారికి ఒక ఆలోచన వచ్చింది. తామే ఎడమ చేతివాటం వారి కోసం ప్రత్యేక స్టోర్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందా.. అని. వెంటనే దేశంలో ఎడమ చేతివాటమున్న వారి లెక్క బయటకు తీశారు. దేశ జనాభాలో 8శాతం మంది అంటే 10కోట్లకుపైగానే ఇలాంటివారు ఉన్నట్లు గుర్తించారు.
(ఫొటో: ది లెఫ్ట్ హ్యాండ్ షాప్ వెబ్సైట్)
స్టార్టప్ ఏర్పాటు ఇలా..
ఆన్లైన్లోనే ఎడమ చేతివాటం వారి కోసం ప్రత్యేక స్టోర్ ఏర్పాటు చేస్తే ఆదరణ లభిస్తుందని సందీప్, పవీత్తర్ గట్టిగా నమ్మారు. దీంతో 2016లో ‘ది లెఫ్ట్హ్యాండ్ షాప్’ పేరుతో ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించారు. దేశవిదేశాల్లోని పెన్నుల సంస్థలతో చర్చలు జరిపారు. భారతదేశంలోనూ ఈ వస్తువులకు మార్కెట్ ఉందని వెల్లడించి.. ఒప్పించి తక్కువ ధరలతో ప్రత్యేక పెన్నులు తయారు చేయించడం మొదలుపెట్టారు. వాటితో ఆగిపోలేదు.. ఎడమచేతివాటం వారికి అవసరమయ్యే ఇతర వస్తువులను సైతం ఆన్లైన్లో అమ్ముతున్నారు. గత నాలుగేళ్లలో 50వేల మంది నుంచి అనేక వస్తువులకు ఆర్డర్స్ రావడం విశేషం. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగి.. తమ స్టార్టప్ మరింత అభివృద్ది చెందుతుందని భావిస్తున్నారు. అయితే, సందీప్, పవీత్తర్ కృషి కారణంగా దేశంలో ఎడమ చేతివాటం ప్రత్యేక పెన్నుల ధర బాగా తగ్గి అటుఇటుగా రూ.వందకే లభిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్షాప్స్లోనూ అందుబాటులో ఉంటున్నాయి. కానీ, ఎడం చేతివాటం వారి కోసం ప్రత్యేకంగా పెన్నులు, కత్తెరలు, షార్ప్నర్స్, స్కెచ్లు, స్పోర్ట్స్ కిట్ ఇలా అన్ని రకాల వస్తువులు కేవలం ‘ది లెఫ్ట్హ్యాండ్ షాప్’లోనే లభిస్తున్నాయి. దీంతో ఈ ఎడమచేతివాటం వాళ్లకు సౌలభ్యంగా ఉండే వస్తువులు లభించడం సులువైంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పని లేకుండా ఈ షాప్ నుంచే వస్తువుల్ని కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఈ స్టార్టప్ ప్రారంభించిన దంపతులు హైదరాబాద్కు చెందిన వారు కావడం విశేషం. మొదట పుణెలో ఉంటూ ఈ స్టార్టప్ ప్రారంభించగా.. రెండేళ్ల కిందట హైదరాబాద్కు తిరిగి వచ్చేశారు. స్టార్టప్ ప్రారంభించిన నాలుగేళ్లలో 50వేల మంది ఎడమచేతివాటమున్న వాళ్లను తమ రెగ్యులర్ కస్టమర్లుగా మార్చుకున్నారు. అంతేకాదు.. ఇలాంటి వారి కోసం అప్పుడప్పుడు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్