తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ప్రత్యేక రైలు

పండగకు సొంతూళ్లకు వచ్చిన వారి తిరుగు ప్రయాణానికి వీలుగా కాకినాడ నుంచి సికింద్రాబాద్‌కు

Published : 15 Jan 2021 03:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్:  పండగకు సొంతూళ్లకు వచ్చిన వారి తిరుగు ప్రయాణానికి వీలుగా కాకినాడ నుంచి సికింద్రాబాద్‌కు ఈ నెల 18న ప్రత్యేక రైలు(07458) నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు కాకినాడ టౌన్‌ నుంచి రాత్రి 8:40 గంటలకు బయలు దేరి సామర్లకోట, అనపర్తి, రాజమహేంద్రవరం, నిడదవోలు, తాడేపల్లి గూడెం, తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా మరుసటి రోజు ఉదయం 8:45 గంటలకు సికింద్రాబాద్‌ చేరనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని