Bhadrachalam: వైభవంగా భద్రాద్రి రామయ్య పట్టాభిషేకం
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారికి శుక్రవారం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. తొలుత ప్రధానాలయంలో స్వామివారిని కల్పవృక్షవాహనంపై వూరేగింపు నిర్వహించారు.
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారికి శుక్రవారం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. తొలుత ప్రధానాలయంలో స్వామివారిని కల్పవృక్షవాహనంపై వూరేగింపు నిర్వహించారు. అనంతరం సామూహిక పారాయణం, హోమాలు చేశారు. రాములవారిని మిథిలా మండపానికి చేర్చే సమయంలో ‘జైశ్రీరామ్’ అంటూ భక్తులు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా పట్టాభిషేక మహోత్సవం గురించి అర్చకులు చేసిన ప్రవచనం అలరించింది. ఇటీవల దేశంలో నలు వైపులా ఉన్న పుణ్య నదులు నుంచి వైదిక సిబ్బంది సేకరించిన పుష్కర తీర్థాలను పట్టాభిషేకానికి తీసుకొచ్చారు. తొలుత మిథిలా మండపం వద్ద ఉంచి వాటికి ఆవాహన పూజలు చేశారు. ఈ నదీ జలాల విశిష్టతను వేద పండితులు వివరించారు. వేడుకను వీక్షించిన భక్తులందరికీ సకల శుభాలు కలగాలని ఆశీస్సులు అందించారు.
రామయ్యకు గవర్నర్ ప్రత్యేక పూజలు
శ్రీరామ పట్టాభిషేక ఉత్సవాలను తిలకించేందుకు గవర్నర్ తమిళిసై భద్రాచలం వచ్చారు. ప్రధానాలయంలో స్వామివారికి పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు ఈవో రమాదేవి సాదర స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రధానాలయంతోపాటు అనుబంధంగా ఉన్న ఆంజనేయస్వామి, లక్ష్మీతాయారమ్మలను గవర్నర్ దర్శించుకున్నారు. అనంతరం పట్టాభిషేకం నిర్వహిస్తున్న మిథిలా మండపానికి చేరుకుని ఈ క్రతువును వీక్షించారు. ఈ వేడుకల్లో త్రిదండి దేవనాథ జీయర్ స్వామి, జిల్లా కలెక్టర్ అనుదీప్, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ వినీత్, ఏఎస్పీ పరితోష్, ఐటీడీఏ పీవో గౌతమ్, ఆర్డీవో రత్నకల్యాణి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM