Srisailam dam: శ్రీశైలం ప్రాజెక్టు 5 గేట్ల ఎత్తివేత.. పర్యాటకుల సందడి

ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల, సుంకేసుల, హంద్రీ జలాశయాల నుంచి 2,26,361 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం

Updated : 05 Aug 2022 16:58 IST

సున్నిపెంట సర్కిల్‌: ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల, సుంకేసుల, హంద్రీ జలాశయాల నుంచి 2,26,361 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు 5 గేట్లను పది అడుగుల మేర ఎత్తి 1,39,685 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ 63,083 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. శుక్రవారం మధ్యాహ్నం 12గంటల సమయానికి 884.70 అడుగులకు నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీంఎంసీలు కాగా.. ప్రస్తుతం 213.88 టీఎంసీలు నీరు ప్రాజెక్టులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం 5గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని