TTD: శ్రీవారికి కానుకల వర్షం.. రూ.131 కోట్లు దాటిన హుండీ ఆదాయం

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి శ్రీవారిపై భక్తులు కానుకల వర్షం కురిపించారు. వరుసగా నవంబర్‌ మాసంలో కూడా శ్రీవారి హుండీ ఆదాయం  రూ.100కోట్ల మార్క్‌ దాటింది.

Updated : 02 Dec 2022 17:58 IST

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి శ్రీవారిపై భక్తులు కానుకల వర్షం కురిపించారు. వరుసగా నవంబర్‌ మాసంలో కూడా శ్రీవారి హుండీ ఆదాయం  రూ.100కోట్ల మార్క్‌ దాటింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి భక్తులను ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతిస్తుండటంతో భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో స్వామివారికి హుండీ కానుకలు భారీగా లభిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా శ్రీవారి హుండీ కానుకలు రూ.100కోట్లకు పైగా వస్తున్నాయి. ఇందులో భాగంగా నవంబర్‌లో రూ.131.56కోట్లు హుండీ కానుకలు లభించాయని తితిదే అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు