ISRO: ఈ ఏడాది తొలి అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. రేపు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ52

2022లో తొలి ప్రయోగానికి భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం(ఇస్రో) సిద్ధమైంది. పీఎస్‌ఎల్వీ- సీ52 వాహక నౌక ప్రయోగాన్ని..

Published : 13 Feb 2022 13:20 IST

నెల్లూరు: 2022లో తొలి ప్రయోగానికి భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం(ఇస్రో) సిద్ధమైంది. పీఎస్‌ఎల్‌వీ- సీ52 వాహకనౌక ప్రయోగాన్ని.. సోమవారం ఉదయం 5.59 గంటలకు చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 4.29 గంటలకు కౌంట్‌డౌన్  ప్రారంభమైంది. ఇది 25 గంటల 30 నిమిషాలపాటు కొనసాగిన అనంతరం.. పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. 1710 కిలోల బరువున్న ఆర్‌ఐశాట్, 1705 కిలోల ఐఎన్‌ఎస్‌-2టీడీ, 8.1 కిలోల ఇన్‌స్పైట్-1 ఉపగ్రహాలను వాహకనౌక మోసుకెళ్లనుంది. ఇస్రో అధిపతి డాక్టర్  సోమనాథ్ శనివారం షార్‌కు చేరుకొని ఎమ్‌ఆర్‌ఆర్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారం కూడా ఆయన అక్కడే ఉండి కౌంట్‌డౌన్ ప్రక్రియను పర్యవేక్షించడంతో పాటు.. శాస్త్రవేత్తలతో వివిధ ప్రాజెక్ట్‌లపై సమీక్ష నిర్వహిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని