SSC: ‘పది’తో 12వేల ఉద్యోగాలు.. ఎంటీఎస్ పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగింపు
ssc మల్టీటాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ ఉద్యోగాలకు దరఖాస్తుల గడువును పొడిగించారు. పదో తరగతి అర్హతతో 12,500వేలకు పైగా ఉద్యోగాల కోసం ఫిబ్రవరి 24వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
దిల్లీ: కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో 12వేలకు పైగా మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ (MTS), హవల్దార్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువును స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పొడిగించింది. పదో తరగతి అర్హతపై 12,523 ఉద్యోగాల కోసం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం.. జనవరి 18న మొదలైన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగిసింది. అయితే, ఆ గడువును ఈ నెల 24న రాత్రి 11గంటల వరకు పొడిగిస్తున్నట్టు staff selection commission వెల్లడించింది. అలాగే, ఈ పరీక్ష ఫీజును ఆన్లైన్లో చెల్లించేందుకు ఈ నెల 26న రాత్రి 11గంటల వరకు అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే మార్చి 2 నుంచి 3 వరకు సరిచేసుకోవచ్చని తెలిపింది. అడ్మిట్ కార్డులు మార్చి/ఏప్రిల్లో అందుబాటులోకి రానున్నాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఏప్రిల్లో జరగే అవకాశం ఉంది.
- ఎంటీఎస్ ఉద్యోగాలకు వయో పరిమితి 18 నుంచి 25 ఏళ్లు.
- హవల్దార్ ఉద్యోగాలకు మాత్రం 18 నుంచి 27 ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు పాటు వయో పరిమితిలో సడలింపు ఉంది.
- దరఖాస్తు రుసుం రూ.100లు. బ్యాంకులో ఆఫ్లైన్లో చలానా తీస్తే మాత్రం ఫిబ్రవరి 27 వరకు చెల్లించొచ్చు.
- సీబీటీ పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుంది. హిందీ, ఇంగ్లిష్, తెలుగుతో పాటు మరో 12 ప్రాంతీయ భాషల్లో పరీక్ష జరుగుతుంది.
- రాతపరీక్ష ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. సెషన్ 1కు నెగిటివ్ మార్కులు ఉండవు. సెషన్ -2 పరీక్షకు మాత్రం నెగెటివ్ మార్కులు ఉంటాయి. ఒక తప్పు సమాధానానికి ఒక మార్కు మైనస్ చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!