కరోనా: జేబుకు చిల్లుపడుతున్నా ప్రైవేటుకే మొగ్గు
కరోనా రెండో దశ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంతో పోలిస్తే తెలంగాణలో వైరస్ బారినపడి ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య అమాంతం పెరుగుతోంది. మహమ్మారి నుంచి కోలుకునేందుకు చాలా మంది ప్రైవేటు బాటపడుతున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి....
ఇంటర్నెట్ డెస్క్: కరోనా రెండో దశ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంతో పోలిస్తే తెలంగాణలో వైరస్ బారినపడి ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య అమాంతం పెరుగుతోంది. మహమ్మారి నుంచి కోలుకునేందుకు చాలా మంది ప్రైవేటు బాటపడుతున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. ఫలితంగా ప్రైవేటులో పడకలు దొరకడం లేదు.
గతంలో ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి సుమారు 15 వేల పడకలను అందుబాటులో ఉంచిన తెలంగాణ సర్కారు.. ఇప్పుడు ఐసోలేషన్ కేంద్రాలతో కలిపి సుమారు 30 వేలకు పెంచింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 27,800లకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా అందులో 9 వేల మందికి పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2600లకు పైగా రోగులు ఉండగా, ప్రైవేటులో 6500 మందికిపైగా చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రైవేటులో ఒక్కో పడకకు రోజుకి రూ.4 వేల బెడ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక మందులు, డాక్టర్ ఫీజు, నర్సింగ్ సేవలు, పీపీఈ కిట్ల రుసుం అంటూ సుమారు రోజుకు రూ.10 వేలు అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రజలు మాత్రం ప్రైవేటు వైపే మొగ్గు చూపుతున్నట్లు అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి.
జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో 3,843 పడకలకు ప్రస్తుతం 2,650 పడకలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటులో 4754 పడకలకు కేవలం 1,751 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. కరీంనగర్లోని సర్కారు దవాఖానాలో 180 పడకలకు 92 ఖాళీగా ఉండగా.. ప్రైవేటులో 598కిగానూ 389 అందుబాటులో ఉన్నాయి. రాజన్న సిరిసిల్లా జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన 50 కొవిడ్ పడకలు పూర్తిగా నిండిపోయాయి. ఇక్కడ మరిన్ని పడకలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.
మేడ్చల్ జిల్లా ప్రైవేటు ఆస్పత్రుల్లోనే 585 మంది చికిత్స పొందుతున్నారు. నిజామాబాద్లో రోజుకు వందకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ జిల్లాలో సర్కారు దవాఖానాల్లో 561 పడకలు ఉండగా.. ఖాళీగా ఉన్నవి కేవలం 214 మాత్రమే. ప్రైవేటులోనూ 297 పడకలకు 266 ఇప్పటికే నిండిపోయాయి. కొవిడ్ నేపథ్యంలో సర్కారు ఆస్పత్రుల్లో వసతులను ప్రభుత్వం మెరుగుపర్చింది. ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు చేపట్టింది. అయినా ప్రభుత్వాస్పత్రులకు వచ్చేవారి సంఖ్య తక్కువగా ఉంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. -
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రుణం కోసం.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
-
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్