ఆ అధ్యక్షుడి గడ్డం వెనకున్న కథ ఇది..!
అబ్రహం లింకన్.. అమెరికా 16వ అధ్యక్షుడు. ఒకరి శరీరకష్టాన్ని ఆస్తిగా భావించడం తగదంటూ బానిసత్వ వ్యవస్థను రద్దు చేసిన వ్యక్తి. అంతర్యుద్ధంలో అమెరికా ప్రభుత్వం విజయం సాధించడానికి స్వయంగా కీలక పాత్ర పోషించారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి.. అమెరికాకు
ఇంటర్నెట్ డెస్క్: అబ్రహం లింకన్.. అమెరికా 16వ అధ్యక్షుడు. ఒకరి శరీర కష్టాన్ని ఆస్తిగా భావించడం తగదంటూ బానిసత్వ వ్యవస్థను రద్దు చేసిన వ్యక్తి. అంతర్యుద్ధంలో అమెరికా ప్రభుత్వం విజయం సాధించడానికి స్వయంగా కీలక పాత్ర పోషించారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి.. అమెరికాకు ఒక గుర్తింపు తెచ్చిన నాయకుల్లో ముఖ్యులు. అబ్రహం లింకన్ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది గడ్డమే. ప్రత్యక్షంగా ఆయన్ను చూసినవాళ్లు ఇప్పుడు ఎవరు లేకపోయినా.. ప్రస్తుతం ఆయన చిత్రాలు, విగ్రహాలు గడ్డంతో ఉన్నట్లుగానే దర్శనమిస్తాయి. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన గడ్డం స్టైల్ అంతలా ఫేమస్ అయింది. అయితే, లింకన్ గడ్డాన్ని అలా పెంచుకోవడం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ఓ పదకొండేళ్ల చిన్నారి సలహా మేరకే ఆయన గడ్డం పెంచుకున్నారట.
అమెరికాలో 1860లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అబ్రహం లింకన్ అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయనకు పోటీగా సౌథర్న్ డెమొక్రాటిక్, కాన్స్టిట్యూషన్ యూనియన్, నార్తర్న్ డెమొక్రాటిక్ పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఎన్నికల ప్రకటన నాటి నుంచి అబ్రహం లింకన్ను సానుకూల అంశాలు ఎక్కువగా ఉండటంతో ఆయనే అధ్యక్షుడయ్యారు. అధ్యక్ష ఎన్నికలకు ముందు.. అబ్రహం లింకన్కు గడ్డం ఉండేది కాదు. కోలముఖంతో చాలా బక్కపల్చగా ఉండేవారు. ఇది గమనించిన పదకొండేళ్ల గ్రేస్ బెడెల్ అనే చిన్నారి ఏకంగా అబ్రహం లింకన్ను ఓ లేఖ రాసింది. ‘మీరు దేశ అధ్యక్షుడు అవ్వాలని నేను బలంగా కోరుకుంటున్నా. నాకు నలుగురు సోదరులు ఉన్నారు. వాళ్లూ, మా నాన్న మీకే ఓటు వేస్తారు. వీలైనంత మందితో మీకే ఓటు వేయిస్తాను. అయితే, ఒక్క విషయం.. మా నాన్న మీ ఫొటో ఒకటి తీసుకొచ్చారు. అందులో మీరు చాలా బక్కపల్చగా కనిపిస్తున్నారు. గడ్డం పెంచుకుంటే చక్కగా కనిపిస్తారు. మహిళలు గడ్డం ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి మీరు దాన్ని పెంచుకుంటే.. మహిళలు వారి భర్తల్ని మీకే ఓటు వేయమని చెబుతారు. తద్వారా మీరు ఎన్నికల్లో గెలిచి దేశాధ్యక్షుడు అవ్వొచ్చు’’అని లేఖ రాసింది. అంతేకాదు, ‘‘మీకు లేఖ రాసే సమయం లేకపోతే.. మీకు నాలాంటి కూతుళ్లు ఉంటే వారితో నాకు సమాధానం ఇస్తూ లేఖ రాయించండి’’అని పేర్కొంది.
1860 అక్టోబర్ 15న గ్రేస్ లేఖ రాయగా.. అక్టోబర్ 19న అబ్రహం లింకనే స్వయంగా స్పందించారు. తిరిగి ఆమెకు లేఖ రాస్తూ ‘‘ప్రియమైన గ్రేస్ బెడెల్ నీ లేఖ నాకు అందింది. ఇది ఎంతో అంగీకారయోగ్యమైనది. అయితే నీలాంటి కూతుళ్లు లేనందుకు చింతిస్తున్నాను. నాకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఒకరికి పదిహేడేళ్లు, మరొకరికి తొమ్మిది, ఇంకొకరికి ఏడేళ్లు. వాళ్లు వాళ్ల అమ్మతో ఉన్నారు. ఇక గడ్డం విషయానికొస్తే.. నేనెప్పుడు దానిని పెంచలేదు. ఉన్నట్టుండి ఇప్పుడు పెంచుకుంటే ప్రజలు నన్ను చూసి వెర్రితనం అనుకుంటారని నువ్వు భావించలేదా? ఏదేమైనా నువ్వు నా శ్రేయోభిలాషివి’’ అని సమాధానమిస్తూ లేఖ పంపారు.
అయితే, అప్పటి నుంచి చిన్నారి సలహా మేరకు అబ్రహం లింకన్ గడ్డం పెంచుకోవడం మొదలుపెట్టారు. అధ్యక్షుడయ్యే సమయానికి ఆయన పూర్తి గడ్డంతో ఉన్నారు. 1861 ఫిబ్రవరిలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్తూ న్యూయార్క్లోని వెస్ట్ఫీల్డ్లో ఆగి.. చిన్నారి గ్రేస్ను కలిసి పలకరించడమే కాదు.. ఆమెతో ‘చూశావా? నీకోసమే ఈ గడ్డం పెంచుకున్నాను’అని వ్యాఖ్యానించారట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల