‘నో షేవ్ నవంబర్’ కథేంటీ?
నవంబర్ వచ్చిందంటే చాలు.. యువత గడ్డం తీసేయడానికి అసలు ఒప్పుకోదు. గడ్డం ఎందుకు పెంచుకుటున్నావ్ అని అడిగితే.. ‘నో షేవ్ నవంబర్’ అనేస్తారు. ఆ నెల మొత్తం బ్లేడ్, ట్రిమ్మర్లకు పని చెప్పకుండా గడ్డాన్ని పెంచుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా ఇదో
ఇంటర్నెట్ డెస్క్: నవంబర్ వచ్చిందంటే చాలు.. పలువురు యువకులు గడ్డం తీసేయడానికి అసలు ఒప్పుకోరు. గడ్డం ఎందుకు పెంచుకుంటున్నావ్ అని అడిగితే.. ‘నో షేవ్ నవంబర్’ అనేస్తారు. ఈ నెల మొత్తం బ్లేడ్, ట్రిమ్మర్లకు పని చెప్పకుండా గడ్డాన్ని పెంచుకుంటారు. గత కొన్నేళ్లుగా ఇదో సంప్రదాయంగా మారిపోయింది. ఇంతకీ అసలు ఈ ‘నో షేవ్ నవంబర్’ ఉద్దేశం ఏంటి? ఎవరు దీన్ని ప్రారంభించారు? తెలుసుకుందాం పదండి..
2009 నుంచి ‘నో షేవ్ నవంబర్’ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఎవరైనా సరే ఈ ఒక్క నెల గడ్డం తీసేయకూడదు. గడ్డం తీసేయడానికి, స్టైల్గా మార్చుకోవడానికి అయ్యే ఖర్చులు మిగిల్చి ఆ డబ్బును ఏదైనా క్యాన్సర్ బాధితులను ఆదుకునే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వాలనేది దీని లక్ష్యం. ఈ ‘నో షేవ్ నవంబర్’ సంప్రదాయాన్ని అమెరికాకు చెందిన మాథ్యూ హిల్ అనే వ్యక్తి మరణానంతరం ఆయన ఎనిమిది మంది సంతానం ప్రారంభించారు. 2007లో మాథ్యూ హిల్ క్యాన్సర్తో మృతి చెందాడు. తండ్రి మరణాన్ని ఆయన పిల్లలు జీర్ణించుకోలేకపోయారు. చాలా కాలం బాధపడ్డారు. అయితే, క్యాన్సర్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న విషయం వారిని మరింత బాధించింది. ఎలాగైనా క్యాన్సర్పై ప్రజలకు అవగాహన కల్పించాలని, క్యాన్సర్పై పరిశోధనలు చేసే సంస్థలకు, క్యాన్సర్ బాధితులను ఆదుకుంటున్న స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే, అందరిలా డబ్బులు విరాళంగా ఇస్తే అది తమతోనే ఆగిపోతుంది.. అలా కాకుండా ప్రజలతోనూ క్యాన్సర్పై కృషి చేస్తున్న పరిశోధన, స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం ఇప్పించాలని భావించారు. అలా నవంబర్ నెలను ఎంచుకొని ‘నో షేవ్ నవంబర్’ కాన్సెప్ట్ను ప్రారంభించారు. ముఖంపై వద్దన్న పెరిగే గడ్డాన్ని మంచి పనికి ఉపయోగించాలని, నవంబర్ నెలలో గడ్డానికి పెట్టే ఖర్చును ఆదా చేసి ఆ మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ మేరకు ‘నో షేవ్.ఆర్గ్’ పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశారు. తమ వెబ్సైట్, సోషల్మీడియా ద్వారా క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూ.. విరాళాలు ఇవ్వాలంటూ ‘నో షేవ్ నవంబర్’కు బాగా ప్రచారం కల్పించారు. కొన్నాళ్లకు అమెరికాలో ఈ సంప్రదాయం బాగా ట్రెండ్ అయింది. ఆ తర్వాత ప్రపంచమంతటా వ్యాపించింది. ప్రస్తుతం ఈ సంస్థ ‘నో షేవ్ నవంబర్’ లోగోలతో దుస్తులు, ఫ్యాషన్ వస్తువులను ఆన్లైన్లో విక్రయిస్తోంది. వీటి ద్వారా వచ్చే డబ్బును కూడా క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలకు, స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తోంది. కొత్తగా ఏ ట్రెండ్ వచ్చినా ఫాలో అయ్యే యువత.. ఈ సంస్థ తీసుకొచ్చిన ‘నో షేవ్ నవంబర్’నూ బాగా పాటిస్తోంది. యువకులే కాదు, యువతులు కూడా ఈ నెలలో చేతులు, కాళ్లపై పెరిగే వెంట్రుకలను తొలగించడం కోసం చేసే ఖర్చును ఆదా చేసి విరాళమిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..