Kadapa: కథా రచయిత.. సాహితీవేత్త కేతు విశ్వనాథ్ రెడ్డి కన్నుమూత

కడపకు చెందిన ప్రముఖ తెలుగు కథా రచయిత, సాహితీవేత్త కేతు విశ్వనాథ్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు.

Published : 22 May 2023 09:11 IST

ఒంగోలు: కడపకు చెందిన ప్రముఖ తెలుగు కథా రచయిత, సాహితీవేత్త కేతు విశ్వనాథ్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. విశ్వనాథ్‌ రెడ్డి రెండు రోజుల క్రితం ఒంగోలులోని ఆయన కుమార్తె ఇంటికి వెళ్లారు. అక్కడ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 5.30 గంటలకు గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని