Anantapur: పాఠశాలకు వెళ్లాలంటే.. వాగు దాటాల్సిందే!

పాఠశాలకు వెళ్లడం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు.. అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థులు. శింగనమల మండలం పోతురాజు కాలువ

Published : 11 Dec 2021 14:10 IST

అనంతపురం: పాఠశాలకు వెళ్లడం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు.. అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థులు. శింగనమల మండలం పోతురాజు కాలువ గ్రామానికి చెందిన 30 మంది పిల్లలు ప్రమాదకరమైన వాగు దాటుతూ భయం భయంగా బడికి వెళ్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామంలోని రహదారి కొట్టుకుపోగా.. తమ తలపై పుస్తకాలు పెట్టుకుని, నీటిలో నడుస్తూ విద్యార్థులు పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు 20 రోజులుగా విద్యార్థులు అవస్థలు పడుతున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్థులు వాపోతున్నారు.

Read latest General News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని