ఏపీ సీఎం ఆఫీస్‌ వ‌ద్ద ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

తాడేప‌ల్లిలోని సీఎం జ‌గ‌న్ క్యాంపు కార్యాల‌యం వ‌ద్ద దంప‌తులు ఆత్మ‌హ‌త్యాయత్నానికి పాల్ప‌డ‌టం క‌ల‌క‌లం సృష్టించింది. సురేశ్‌, స‌ర‌స్వ‌తి దంప‌తులు పెట్రోల్

Updated : 19 May 2021 15:15 IST

అమ‌రావ‌తి: గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలోని సీఎం జ‌గ‌న్ క్యాంపు కార్యాల‌యం వ‌ద్ద దంప‌తులు ఆత్మ‌హ‌త్యాయత్నానికి పాల్ప‌డ‌టం క‌ల‌క‌లం సృష్టించింది. సురేశ్‌, స‌ర‌స్వ‌తి దంప‌తులు పెట్రోల్ పోసుకుంటుండ‌గా అడ్డుకున్న పోలీసులు వారిని తాడేప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

కృష్ణా జిల్లా పెద్ద అవుటుప‌ల్లికి చెందిన ఈ దంప‌తులు సీఎంను క‌లిసేందుకు వ‌చ్చిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న‌ట్లు.. సీఎం స‌హాయం కోసం వ‌చ్చిన‌ట్లు దంప‌తులు చెబుతున్నార‌ని వివ‌రించారు. కొవిడ్ నిబంధ‌న‌ల కార‌ణంగా సీఎంను క‌లిసే అవ‌కాశం లేద‌ని చెప్ప‌డంతో వారు పెట్రోల్ పోసుకొని ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డార‌ని పోలీసులు తెలిపారు. 

 






 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని