cardiac arrest: అకస్మాత్తుగా గుండె ఆగిపోయినపుడు ఏం చేయాలి..?
కొంతమంది ఉన్నట్టుండి కుప్పకూలిపోతారు..దానికి గుండె ఒక్కసారిగా ఆగిపోవడమే కారణం.
ఇంటర్నెట్డెస్క్: కొంతమంది ఉన్నట్టుండి కుప్పకూలిపోతారు..దానికి గుండె ఒక్కసారిగా ఆగిపోవడమే కారణం. ఇలా గుండె ఆగిపోవడానికి ఎన్నో కారణాలున్నాయని ఇంటర్వేన్షనల్ కార్డియాలజిస్టు శ్రీధర్ కస్తూరి చెబుతున్నారు.
ఎందుకిలా..: సునామీ, తుపాన్ వచ్చినప్పుడు కరెంటు ఉన్నట్టుండి పోతుంది. అలాగే కొన్నిసార్లు గుండె వ్యవస్థ కూడా అనుకోకుండా కూలిపోతుంది. ఇలాంటి పరిస్థితిని వైద్యులు సడెన్ కార్డియాక్ డెత్గా పిలుస్తారు. మేజర్ హార్ట్ అటాక్ రావడం, గుండెకు రక్తసరఫరా నిలిచిపోవడంతో చనిపోతారు. డీహైడ్రేషన్, లూజు మోషన్ వాళ్లలో పొటాషియం బాగా పెరుగుతుంది. డయాలసిస్ రోగుల్లోనూ పొటాషియం బాగా పెరగొచ్చు. గుండె కండరాలు బలహీన పడినప్పుడు కూడా గుండె ఆగిపోవచ్చు.
అతి వ్యాయామం: క్రీడాకారులు, సినిమా హీరోలు ఫిట్నెస్ సాధించడానికి అతిగా చేసే వ్యాయామం కూడా ప్రాణాలపైకి తీసుకొస్తుంది. గుండెలో విద్యుత్తు సరిగా ఉత్పత్తి కాకపోవడం, గుండె కండరం పెరిగిపోవడం, ప్రతిభ చూపాలనే ఒత్తిడితో ప్రమాదాలు జరుగుతున్నాయి. యువకుల్లో గుండె ఆగిపోవడానికి గుండె కండరాలు అపక్రమంగా పెరిగిపోవడమే ప్రధాన కారణం.
ఎలా ఉంటుందంటే: సడెన్ కార్డియాక్ డెత్ వచ్చే ముందు నీరసంగా ఉండటం, తల తిరిగినట్టు ఉంటుంది. ఛాతీ నొప్పి కూడా వస్తుంది. ఛాతీ బరువుగా ఉండటంతో పాటు విపరీతంగా చెమటలు పడతాయి. కొంతమందికి ఛాతీపై కాకుండా గొంతు దగ్గర లాగినట్టు అనిపించవచ్చు. కడుపులో మంటలాగా కూడా ఉంటుంది. స్పృహ కోల్పోతారు. శ్వాస ఆగిపోతుంది. హృదయ స్పందన నెమ్మదిగా తగ్గుతుంది.
ఏం చేయాలి: సడెన్ కార్డియాక్ అటాక్ వచ్చిన వ్యక్తికి గుండెపై లయబద్దంగా గట్టిగా అదమాలి. గుండెలో స్పందనలు తేవడానికి ప్రయత్నించాలి. వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించాలి. ఇక అధిక రక్తపోటు, మధుమేహం ఉన్న వారు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. -
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
-
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
-
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు
-
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు
-
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
-
ఇన్ఫీ లాభం 30 శాతం జంప్.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్