కోణార్క్ తరహాలో అయోధ్య గుడి నిర్మాణం.. ఆ రోజు రాముడి పాదాల చెంతకు సూర్యకిరణాలు
Ayodhya: ఒడిశాలోని కోణార్క్ దేవాలయం, శ్రీకాకుళంలోని అరసవల్లి పుణ్య క్షేత్రాల తరహాలో అయోధ్య రామ మందిరాన్ని తీర్చిదిద్దేందుకు రామ మందిర ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది.
దిల్లీ: అయోధ్య రాముడి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత కనువిందు చేసే విధంగా ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కొత్త ఏర్పాట్లు చేస్తోంది. ఒడిశాలోని కోణార్క్, శ్రీకాకుళంలోని అరసవల్లి పుణ్య క్షేత్రాల తరహాలో గర్భగుడిలోకి సూర్య కిరణాలను ప్రసరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రస్ట్ సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ తెలిపారు. 13వ శతాబ్దంలో నిర్మించిన కోణార్క్ ఆలయాన్ని స్ఫూర్తిగా తీసుకుని శ్రీరామ నవమి రోజు రాముని పాదాలను సూర్య కిరణాలు తాకే విధంగా గుడి నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు.
ఇప్పటికే సంబంధిత పనులు జరుగుతున్నాయని కామేశ్వర్ చౌపాల్ చెప్పారు. ఇందుకోసం సైంటిస్టులు, జ్యోతిషులు, సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా దేవాలయ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టడానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) దిల్లీ, ఐఐటీ ముంబయి, ఐఐటీ రూర్కీతో సహా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే, రామమందిర నిర్మాణం వేగంగా జరుగుతోందని, 2023 డిసెంబర్ నాటికి భక్తులకు గుడి అందుబాటులోకి రానుందని చౌపాల్ చెప్పారు. భౌగోళిక, పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వివరించారు. ముందు అనుకున్నట్లు రెండంతస్థులు కాకుండా మూడు అంతస్థుల్లో మందిర నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో మ్యూజియం, రీసెర్చ్సెంటర్, ఆడిటోరియం, గోశాల, పర్యాటక కేంద్రం, అడ్మినిస్ట్రేటివ్ భవనం, యోగా కేంద్రం తదితరాలు కొలువుదీరనున్నాయని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు