Sundar Naidu Uppalapati: అశ్రునయనాల మధ్య సుందరనాయుడు అంత్యక్రియలు

బాలాజీ హేచరీస్‌ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ఉప్పలపాటి సుందరనాయుడు (85) అంత్యక్రియలు చిత్తూరు సుందరనగర్‌లోని బాలాజీ హేచరీస్‌ ఆవరణలో నిర్వహించారు.

Updated : 09 May 2022 02:04 IST

చిత్తూరు: బాలాజీ హేచరీస్‌ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ఉప్పలపాటి సుందరనాయుడు (85) అంత్యక్రియలు చిత్తూరు సుందరనగర్‌లోని బాలాజీ హేచరీస్‌ ఆవరణలో నిర్వహించారు. సోదరుని కుమారుడు రమేశ్‌బాబు... అంతిమసంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు సుందరనాయుడు భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన కుమార్తె, మార్గదర్శి ఎండీ శైలజను ఓదార్చారు. వేలమంది రైతులు, యువతను కోళ్ల పరిశ్రమవైపు నడిపించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మార్గదర్శి సుందరనాయుడని కొనియాడారు. సుందరనాయుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో హృద్రోగ సమస్యకు చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. పశువైద్యుడిగా వృత్తిని ప్రారంభించిన ఆయన... కోళ్ల పరిశ్రమలో ప్రవేశించి ఆ రంగం అభివృద్ధికి అపార కృషిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలితరం పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని