సివిల్ జడ్జి పరీక్ష అర్హతపై సుప్రీం విచారణ
ఆంధ్రప్రదేశ్లో సివిల్ జడ్జి పరీక్ష అర్హతపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సివిల్ జడ్జి పరీక్ష అర్హతకు మూడేళ్లు న్యాయవాదిగా పనిచేసి ఉండాలన్న నిబంధనను సవాలు చేస్తూ వెంకటేశ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నిబంధనను రద్దు చేసేలా..
దిల్లీ: ఆంధ్రప్రదేశ్లో సివిల్ జడ్జి పరీక్ష అర్హతపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సివిల్ జడ్జి పరీక్ష అర్హతకు మూడేళ్లు న్యాయవాదిగా పనిచేసి ఉండాలన్న నిబంధనను సవాలు చేస్తూ వెంకటేశ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నిబంధనను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు పిటిషన్పై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ తరఫున న్యాయవాది పునీత్ జైన్ వాదనలు వినిపించారు. పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే మరోవైపు మూడేళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలని పేర్కొంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. ఇంప్లీడ్ అయ్యేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది. వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్ దాఖలు చేసేందుకు 3 వారాల గడువు ఇచ్చింది. మరోవైపు సివిల్ జడ్జి పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషనర్ ధర్మాసనాన్ని కోరారు. దరఖాస్తు గడువు ముగిసినందున ఇప్పుడు దానిపై నిర్ణయం తీసుకోలేమని ధర్మాసనం తెలిపింది వెల్లడించింది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు