Karnataka: జన్మదిన వేడుకల్లో ప్రసంగిస్తూ స్వామీజి మృతి

కర్ణాటకలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. బెల్గావి జిల్లాలోని బలోబల మఠం పీఠాధిపతి సంగనబసవ మహా స్వామీజీ..

Published : 17 Nov 2021 01:31 IST

బెళగావి: కర్ణాటకలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. బెళగావి జిల్లాలోని బలోబల మఠం పీఠాధిపతి సంగనబసవ మహా స్వామీజీ.. ప్రసంగిస్తూనే ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 6న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తన జన్మదిన వేడుకల సందర్భంగా పెద్దఎత్తున హాజరైన భక్తులను ఉద్దేశించి స్వామీజీ  ప్రసంగిస్తున్నారు. ఆ సమయంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో స్వామీజీ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కూర్చున్న చోటే వెనక్కి ఒరిగి కన్నుమూశారు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు భక్తుల మొబైల్‌ ఫోన్లలో రికార్డవగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని