TS High Court: కొత్తగా ఆరుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
తెలంగాణ హైకోర్టులో కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. కొత్త జడ్జీలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ఉజ్జల్ భయాన్ ప్రమాణ
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. కొత్త జడ్జీలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. న్యాయమూర్తులుగా జస్టిస్ ఏనుగుల వెంకట వేణుగోపాల్, జస్టిస్ నగేష్ భీమపాక, జస్టిస్ పుల్లా కార్తీక్, జస్టిస్ కాజ శరత్, జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. నూతన న్యాయమూర్తులకు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభినందనలు తెలిపారు.
కొత్త న్యాయమూర్తుల నేపథ్యమిదీ..
జస్టిస్ ఏనుగుల వెంకట వేణుగోపాల్
కరీంనగర్ మంకమ్మతోటలో 1967 ఆగస్టు 16న జన్మించారు. తండ్రి ఇ.వి.రాజేశ్వర్రావు (హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ మాజీ డిప్యూటీ డైరెక్టర్), తల్లి ఇ.వి.బాలకుమారి (ఉమ్మడి ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు). కరీంనగర్ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో 1992లో న్యాయశాస్త్రంలో పట్టా పొంది అదే ఏడాది బార్ కౌన్సిల్లో నమోదయ్యారు. కొంత కాలం కరీంనగర్లో ప్రాక్టీస్ చేశారు. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దివంగత రామ్జెఠ్మలానీ వద్ద జూనియర్గా పనిచేశారు. రైల్వే స్టాండింగ్ కౌన్సిల్గా సేవలు అందించారు. 2021లో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు.
జస్టిస్ నగేష్ భీమపాక
భద్రాచలంలో మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధుడు భూపతిరావు, శాంతమ్మలకు 1969 మార్చి 8న జన్మించారు. అక్కడే ప్రాథమిక, ఉన్నత విద్యనభ్యసించి ఏలూరు సీఆర్ రెడ్డి న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. లాలో పోస్టుగ్రాడ్యుయేషన్ను హైదరాబాద్ నిజాం కాలేజీలో పూర్తి చేశారు. 1993లో బార్ కౌన్సిల్లో నమోదై హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, కార్మిక, రెవెన్యూ, మున్సిపల్ చట్టాలతో పాటు ఆర్బిట్రేషన్ చట్టాలకు చెందిన కేసుల్లో వాదనలు వినిపించారు. ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్గా, పరిశ్రమల శాఖ ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. ప్రస్తుతం వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు.
జస్టిస్ పుల్లా కార్తీక్
జగిత్యాలలో ఒగ్గు హనుమంతు, పోచమల్లమ్మలకు 1967 జూన్ 4న జన్మించారు. అక్కడి ప్రభుత్వ పాఠశాల,కళాశాలల్లో పాఠశాల విద్యతో పాటు ఇంటర్ చదివారు. డిగ్రీ, పీజీలను ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఉస్మానియాలోనే లా, ఎల్ఎల్ఎంలు చదివారు. 1996లో బార్కౌన్సిల్లో నమోదయ్యాక హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2015లో ఏపీ పరిపాలన ట్రైబ్యునల్లో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించి, 2017 నుంచి హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు.
జస్టిస్ కాజ శరత్
భద్రాచలంలో సీతారామయ్య, లలితాంబలకు 1971 జనవరి 29న జన్మించారు. పాఠశాల విద్యతో పాటు డిగ్రీని భద్రాచలంలోనే పూర్తి చేశారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఉస్మానియాలో ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1997లో బార్కౌన్సిల్లో నమోదయ్యాక కొత్తగూడెం, భద్రాచలం జిల్లా కోర్టుల్లో ప్రాక్టీస్ ప్రారంభించారు. అనంతరం 2002 నుంచి హైకోర్టులో అన్ని రకాల కేసుల్లోనూ వాదనలు వినిపిస్తున్నారు.
జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాసరావు
రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 1969 ఆగస్టు 31న జన్మించారు. తండ్రి జె.మాణిక్యరావు. ఉస్మానియాలో బీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేసి 1999లో బార్కౌన్సిల్లో నమోదై హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2015 నుంచి సింగరేణి కాలరీస్ స్టాండింగ్ కౌన్సిల్గా కొనసాగుతున్నారు.
జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు
మహబూబాబాద్ జిల్లా సూదనపల్లిలో ఎన్.సత్యనారాయణరావు, గిరిజాకుమారిలకు 1969 జూన్ 30న జన్మించారు. పాఠశాల విద్య వరంగల్ సరస్వతి శిశుమందిర్, కాలేజీ విద్య గోవిందరావుపేటలో పూర్తిచేశారు. పెండేకంటి లా కాలేజీలో న్యాయశాస్త్రంలో పట్టాపొందారు. 2001లో హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్గా, తెలంగాణలో యూజీసీ, ఎస్ఎఫ్ఐవో, ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రైబ్యునల్ ప్యానెల్ న్యాయవాదిగా, 2019 నుంచి అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్గా సేవలందిస్తున్నారు. సివిల్, ఆర్థిక నేరాలు, కార్పొరేట్ లా, మోటారు ప్రమాదాలు, సర్వీసుకు చెందిన కేసుల్లో వాదనలు వినిపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?