Potato Milk: ఏవండోయ్.. ‘ఆలూ పాలు’ గురించి విన్నారా?
మీకు తెలిసిన పాల గురించి చెప్పండి అంటే.. గుక్కతిప్పుకోకుండా ఆవు పాలు, గేదె పాలు, సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్, ఓట్ మిల్క్ అని చెప్పేస్తారు. అవీ కాకుండా ఇంకొన్ని చెప్పడంటే... మేకపాలు, గాడిదపాలు, ఒంటె పాలు అని చెప్తారు.
(credits: Kirsty Bosley twitter)
ఇంటర్నెట్ డెస్క్: మీకు తెలిసిన పాల గురించి చెప్పండి అంటే.. గుక్కతిప్పుకోకుండా ఆవు పాలు, గేదె పాలు, సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్, ఓట్ మిల్క్ అని చెప్పేస్తాం. అవీ కాకుండా ఇంకొన్ని చెప్పడంటే... మేకపాలు, గాడిదపాలు, ఒంటె పాలు అని చెప్తాం.. తాజాగా ఆ లిస్ట్లో మరో పేరు చేరింది. అదే.. ‘ఆలూ మిల్క్’. అవును..! ఇప్పుడు ఆలూ పాలు అందుబాటులోకి వచ్చాయి. స్వీడన్కు చెందిన డగ్ (DUG) కంపెనీ వీటిని బ్రిటన్లో ప్రవేశపెట్టింది. అందుబాటు ధరలో ఉన్న వీటిలో పోషకవిలువలూ ఎక్కువే. వివిధ విటమిన్స్ శరీరానికి అందటంతో పాటు రుచికరంగా ఉంటాయట. సాధారణంగా ఆవులు, గేదెలు వంటి జంతువుల నుంచి లభించే పాలల్లో లాక్టోజ్ ఉంటుంది. అయితే ఈ బంగాళాదుంప పాలలో లాక్టోజ్ ఉండకపోవడం గమనార్హం. అందుకే శాకాహారులు దీన్ని విపరీతంగా ఇష్టపడుతున్నారట. ఇక ఈ పాల ధర లీటర్ రూ. 170 ఉండటంతో పెద్ద మొత్తంలో వ్యాపారానికి గీరాకి అవుతోంది. సోయా పాలలో లభించే ప్రోటీన్ల కన్నా ఇందులో నాలుగు రెట్లు అధికంగా ఉంటాయట.
- జంతువుల నుంచి సేకరించే పాలలాగానే ఆలూ పాలు కూడా చిక్కగా, రుచికరంగా ఉంటాయన్నది విశ్లేషకుల మాట.
- ప్రస్తుతం బ్రిటన్లో అందుబాటులో ఉన్న ఈ పాలు.. త్వరలోనే ఐరోపాతో పాటు, అమెరికా, చైనాలోనూ ప్రారంభించాలని డగ్ కంపెనీ యోచిస్తోంది.
- ఈ పాలతో మనం కాఫీ లాగానే కాపిచీనో కూడా తయారు చేసుకోవచ్చని ఆహార ప్రియులు చెబుతున్నారు.
- మాల్టోడెక్స్ట్రిన్, పీ ప్రొటీన్, చికోరీ ఫైబర్, ర్యాప్సీడ్ ఆయిల్, ఫ్రక్టొస్, సుక్రోజ్ సహా వివిధ పోషకాలతో కూడిన ఆలూ పాలను కొనేందుకు ప్రస్తుతం యూకేవాసులు పోటీపడుతున్నారట.
- ఇది వెగాన్ ఫ్రెండ్లీ (అంటే జంతురహిత ఉత్పత్తి) కావడంతో వీగన్లు కూడా ఈ ఆలూ పాలు కొంటున్నారు.
- జంతువులు ఇచ్చే పాలలో ఉండే లాక్టోజ్ (ఒక రకమైన చక్కెర) కొందరికి జీర్ణం కాదు. కానీ ‘డగ్’ తయారు చేసే ఆలూ పాలు లాక్టోజ్రహితమైనవట. అందుకే ఆలూ పాలకి డిమాండ్ పెరిగింది.
- ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్ కంటే తక్కువ ధర కావటంతో ఎక్కువగా అమ్ముడుబోతున్నాయని వినియోగదారులు అంటున్నారు.
- వ్యాపార స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు వీలుండటంతో ఆలూ నుంచి పాల తయారీని లాభదాయక వ్యాపారంగా చేసుకున్నామని ‘డగ్’ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
- తక్కువ నీటి వాడకంతోనే ఆలూ పంట చేతికొచ్చే అవకాశం ఉండటం కూడా ఇందుకు మరో కారణమని కంపెనీ చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు