కలాం రెండోసారి రాష్ట్రపతి అయ్యుంటే: తమిళిసై

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం రెండోసారి రాష్ట్రపతి అయ్యుంటే దేశానికి, యువతకు ఎంతో మేలు జరిగేదని తెలంగాణ గవర్నర్‌ తిమిళిసై సౌందరరాజన్‌ అభిప్రాయపడ్డారు. కలాం వర్థంతి సందర్బంగా ఏపీజే కలాం అంతర్జాతీయ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో దృశ్య మాధ్యమం ద్వారా

Published : 28 Jul 2020 01:32 IST

హైదరాబాద్‌: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం రెండోసారి రాష్ట్రపతి అయ్యుంటే దేశానికి, యువతకు ఎంతో మేలు జరిగేదని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అభిప్రాయపడ్డారు. కలాం వర్థంతి సందర్బంగా ఏపీజే కలాం అంతర్జాతీయ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో దృశ్య మాధ్యమం ద్వారా గవర్నర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. సహనశీల సుందర సమాజ నిర్మాణమే కలాంకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. శ్రమను, కృషిని అబ్దుల్‌ కలాం ఎంతో గౌరవించేవారని చెప్పారు. కలాం రెండోసారి రాష్ట్రపతి కాకపోవడం దేశానికి, యువతకు తీరని అన్యాయమని పేర్కొన్నారు. కలాం విజన్‌, లక్ష్యాలను సాకారం చేసేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని గవర్నర్‌ చెప్పారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని