Telangana News: మహిళా సాధికారత సాధించినప్పుడే సమాజంలో అభివృద్ధి: తమిళిసై
మహిళలకు ఇప్పటికీ సరైన గౌరవం దక్కడం లేదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు కూడా సరైన గౌరవం పొందలేకపోతున్నారని
హైదరాబాద్: మహిళలకు ఇప్పటికీ సరైన గౌరవం దక్కడం లేదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు కూడా సరైన గౌరవం పొందలేకపోతున్నారని తెలిపారు. మహిళా సాధికారత సాధించినప్పుడే సమాజం అభివృద్ధి మార్గంలో దూసుకుపోతుందన్నారు. ప్రతి ఒక్కరు మహిళల అభ్యున్నతి కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో మాతృభూమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గవర్నర్తో పాటు సినీ నటుడు సుమన్, ఐఏఎస్ అధికారి వాణీప్రసాద్, ఐఎఫ్ఎస్ అధికారి రామలక్ష్మి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు, మాతృభూమి ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు విఠల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో రాణిస్తున్న పలువురు మహిళలకు మహిళా శక్తి పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. నిరంతరం పని ఒత్తిడితో ఉండే మహిళలు తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించొద్దని గవర్నర్ సూచించారు. ప్రతి మహిళా తమ ఆరోగ్య సంరక్షణ కోసం నిరంతరం పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. మహిళలు లేనిదే సృష్టి లేదని.. ఆలాంటి సృష్టి మూర్తిని గౌరవించుకోవడం చాలా ఆనందంగా ఉందని సినీ నటుడు సుమన్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా