Chandrababu: దిల్లీ చేరుకున్న తెదేపా అధినేత చంద్రబాబు

రెండు రోజుల పర్యటన నిమిత్తం తెదేపా అధినేత చంద్రబాబు దిల్లీ చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.

Published : 05 Dec 2022 13:12 IST

దిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం తెదేపా అధినేత చంద్రబాబు దిల్లీ చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. త్వరలో పార్లమెంట్‌ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తిన అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

అనంతరం సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోదీ నేతృత్వంలో జీ20 సదస్సు నిర్వహణపై జరిగే అఖిలక్ష భేటీకి ఆయన హాజరుకానున్నారు. ఏపీ సీఎం జగన్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఆయన దిల్లీకి బయల్దేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని