AP News: ఏపీ డీజీపీకి చంద్ర‌బాబు లేఖ‌ 

నెల్లూరు జిల్లా పైడేరు కాలువ‌లో వైకాపా నేతల మ‌ట్టి మాఫియాను ప్ర‌శ్నించినందుకు మ‌ల్లికార్జున్ అనే ఎస్సీ యువ‌కుడిపై వైకాపా కార్య‌క‌ర్త‌లు దాడి చేశార‌ని తెదేపా అధినేత చంద్ర‌బాబు ధ్వ‌జ‌మెత్తారు. మ‌ల్లికార్జున్‌ను

Published : 20 Jun 2021 15:29 IST

నెల్లూరు: నెల్లూరు జిల్లా పైడేరు కాలువ‌లో వైకాపా నేతల మ‌ట్టి మాఫియాను ప్ర‌శ్నించినందుకు మ‌ల్లికార్జున్ అనే ఎస్సీ యువ‌కుడిపై వైకాపా కార్య‌క‌ర్త‌లు దాడి చేశార‌ని తెదేపా అధినేత చంద్ర‌బాబు ధ్వ‌జ‌మెత్తారు. మ‌ల్లికార్జున్‌ను త‌ప్పుడు కేసులో ఇరికించిన కొడవ‌లూరు పోలీసుల‌పై విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్‌కు లేఖ రాశారు. పోలీసులు అధికార పార్టీ నాయ‌కుల‌తో చేతులు క‌లిపి ఎస్సీ యువ‌కుడిపై దాడి చేయ‌డం దుర్మార్గ‌మ‌న్నారు. పౌరుల ప్రాథ‌మిక హ‌క్కుల‌కు భంగం క‌లిగేలా పోలీసుల చ‌ర్య‌లు ఉన్నాయ‌ని తెలిపారు. మ‌ల్లికార్జున్‌పై పెట్టిన కేసుల‌ను తొల‌గించాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని