Chandrababu: గౌతమ్‌రెడ్డి హుందాగా పని చేశారు: చంద్రబాబు

ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణం చాలా బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ ఉదయం గుండెపోటుతో చనిపోయిన గౌతమ్‌రెడ్డి నివాసానికి వెళ్లిన ఆయన..

Updated : 21 Feb 2022 14:13 IST

హైదరాబాద్: ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణం చాలా బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ ఉదయం గుండెపోటుతో చనిపోయిన గౌతమ్‌రెడ్డి నివాసానికి వెళ్లిన ఆయన.. మంత్రి  పార్థివదేహానికి నివాళులర్పించారు. జూబ్లీహిల్స్‌లోని ఇంటికి వెళ్లి గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తెల్లవారుజాము వరకు ఆరోగ్యంగా ఉండి జిమ్‌కు వెళ్తున్న సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో గౌతమ్‌రెడ్డిని అపోలోకు తరలించారన్నారు. ఆస్పత్రికి వెళ్లే సరికే శ్వాస ఆడని పరిస్థితి నుంచి హఠాన్మరణం చెందడం విచారకరమని చెప్పారు.

గౌతమ్‌రెడ్డి ఇటీవల దుబాయ్‌లో పర్యటనకు సంబంధించి టీవీలో వార్తలు చూసినట్లు చంద్రబాబు తెలిపారు. గౌతమ్‌రెడ్డి వివాదాల జోలికి పోకుండా హుందాగా, సమర్థంగా పని చేశారని కొనియాడారు.గౌతమ్‌రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని.. ఆయన కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని