Chandrababu: తెలుగు జాతికి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తా: చంద్రబాబు
తెలుగు జాతికి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజల పక్షాన పోరాడేందుకు శక్తిసామర్థ్యాలు ఇవ్వాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు.
విజయవాడ: తెలుగు జాతికి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజల పక్షాన పోరాడేందుకు శక్తిసామర్థ్యాలు ఇవ్వాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. ప్రజలకు దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు ఇవాళ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారి అభివృద్ధి కోసం తెదేపా ఎప్పుడూ పాటుపడుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు తనను ఆశీర్వదిస్తున్నారని.. తన జన్మదినం సందర్భంగా వేడుకలు చేసుకుంటూ శుభాకాంక్షలు చెబుతున్నారని చెప్పారు. వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అందరి అంచనాలకు తగ్గట్లు పని చేస్తూ తెదేపాను నడిపిస్తానని చంద్రబాబు వివరించారు. తప్పకుండా విజయం సాధిస్తానని నమ్మకం ఉందన్నారు. రాజీలేని పోరాటంతో అండగా నిలబడతానన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు..
మరోవైపు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరిగాయి. ఆ పార్టీ నేతలు, శ్రేణులు కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెదేపా పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చంద్రబాబు నివాసంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ నేతలు దేవినేని ఉమా, యరపతినేని, బొండా ఉమ, టీడీ జనార్దన్లు విషెస్ చెప్పారు. తిరుమల అఖిలాండం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెదేపా రాష్ట్ర మీడియా సమన్వయకర్త శ్రీధర్ వర్మ 720 కొబ్బరికాయలు కొట్టి, 720గ్రాముల కర్పూరం వెలిగించారు. అలిపిరి శ్రీవారి పాదాల చెంత తెదేపా కార్యకర్తలు 1,116 కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో ఆ పార్టీ నేతలు సుగుణమ్మ, నరసింహయాదవ్ పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో దేవినేని ఉమా ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ తెలుగుజాతికి పూర్వవైభవం తేవాలని కార్యకర్తలకు సూచించారు. పరిపాలనా దక్షతతో ప్రపంచ దేశాల కళ్లు తెలుగువారి వైపు మళ్లించారని కొనియాడారు. విజయవాడలోని పటమట స్కూల్ పిల్లలతో కలిసి దేవినేని చందు 72కిలోల కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన 250మంది పిల్లలకు పుస్తకాలతో పాటు స్టేషనరీ పంపిణీ చేశారు. గుంటూరులో నక్కా ఆనంద్బాబు, నసీర్ అహ్మద్లు కేక్ కట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు