Polavaram: ఎప్పటికైనా పోలవరం పూర్తి చేసేది చంద్రబాబే: తెదేపా నేతలు
పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అవకతవకలు, లోపాలను ఎత్తి చూపడంతో పాటు ప్రజలకు వాస్తవాలను తెలియపరచాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నేతలు చేపట్టిన ప్రాజెక్టు సందర్శన ఉద్రిక్తతకు దారితీసింది.
అమరావతి: పోలవరం ప్రాంతంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మైనింగ్ రహస్యాలు బయటపడతాయనే తెలుగుదేశం పార్టీ నేతలను ప్రాజెక్టు సందర్శనలకు అనుమతి ఇవ్వడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ప్రాజెక్టులోని లోపాలను బాహ్య ప్రపంచానికి తెలుస్తాయనే ఉద్దేశంతో తెదేపా నాయకుల పర్యటనలపై ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చంద్రబాబు తప్పిదం వల్లే దెబ్బతిందంటూ పదే పదే వైకాపా చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. ప్రాజెక్టులో జరుగుతున్న అవకతవకలు, లోపాలను ఎత్తి చూపడంతో పాటు ప్రజలకు వాస్తవాలను తెలియపరచాలనే ఉద్దేశంతో తెదేపా నేతలు శనివారం చేపట్టిన పోలవరం ప్రాజెక్టు సందర్శన ఉద్రిక్తతకు దారితీసింది.
ఏలూరు నుంచి బయలుదేరిన తెలుగుదేశం పార్టీ నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, తెదేపా ఏలూరు ఇంఛార్జి బడేటి రాధాకృష్ణను పోలీసులు అడ్డుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడు వద్ద నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తెదేపా నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల నుంచి తప్పించుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమా.. ద్విచక్రవాహనంపై పోలవరం ఏటిగట్టు ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని బుట్టాయగూడెం పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు ఎమ్మెల్యే నిమ్మలతో పాటు గన్ని, రాధాకృష్ణ, వెంకటరాజును గోపాలపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. తమ పార్టీ నేతలను అడ్డుకున్న విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి జవహర్ సైతం పోలవరం ప్రాంతానికి వస్తుండగా.. మార్గం మధ్యలో కన్నాపురం అడ్డరోడ్డు వద్ద పోలీసులు అడ్డుకుని బుట్టాయగూడెం స్టేషన్కు తరలించారు. తెదేపా నేతల అరెస్టు విషయాన్ని తెలుసుకున్న ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున గోపాలపురం పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. తమ నాయకులను విడిచిపెట్టాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గోపాలపురం పోలీస్ స్టేషన్ నుంచి ఎమ్మెల్యే నిమ్మలతో పాటు గన్ని, రాథాకృష్ణ, వెంకటరాజును బయటకు తీసుకువచ్చిన పోలీసులు మరో చోటికి తరలించే క్రమంలో అక్కడా ఉద్రిక్తత నెలకొంది. తమ నాయకులను ఎక్కడికి తరలిస్తున్నారో చెప్పాలంటూ ఆ పార్టీ శ్రేణులు పోలీసు వాహనాలను అడ్డుకోగా.. పోలీసులు వారిని బలవంతంగా పక్కకు నెట్టేసి వాహనాలను ముందుకు పోనిచ్చారు. వాహనంలోకి ఎక్కించుకున్న తెదేపా నేతలను కొద్దిసేపు జాతీయ రహదారిపై అటూ ఇటూ తిప్పి.. నిమ్మలను పెనుమంట్ర పోలీసులకు అప్పగించారు. మిగిలిన వారిని తిరిగి గోపాలపురం స్టేషన్కు తీసుకువచ్చారు. మధ్నాహ్నం తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ వారి వారి ఇళ్ల వద్ద పోలీసులు విడిచిపెట్టారు.
పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం కావడానికి వైకాపా ప్రభుత్వ విధానాలు, ముఖ్యమంత్రి అవగాహన రాహిత్యమే కారణమని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించారు. కేవలం ధనదాహం కారణంగానే ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని ఇక్కడున్న విలువైన ఖనిజ సంపదపై ముఖ్యమంత్రి కన్నుపడిన కారణంగానే ప్రజాప్రతిధులను సైతం ప్రాజెక్టు సందర్శనకు అనుమతించని పరిస్థితులు నెలకొన్నాయని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టును ఎప్పటికైనా పూర్తి చేసేది చంద్రబాబు నాయుడేనన్నారు. సీఎం జగన్ డయాఫ్రమ్ వాల్ వద్ద ఇసుక పూడ్చే నెపంతో రూ.వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
RK Roja: తెదేపాను వీడినప్పటి నుంచి కక్ష కట్టారు: మంత్రి రోజా
-
YS Jagan: రేపు దిల్లీకి సీఎం జగన్.. హఠాత్తుగా సామర్లకోట పర్యటన వాయిదా
-
స్నేహితులను వరించిన అదృష్టం.. లాటరీలో రూ.కోటిన్నర గెలుపు
-
Engineering Counselling: ఏపీలో ఇంజినీరింగ్లో మూడో విడత కౌన్సెలింగ్ ఎత్తివేత
-
Guntur: సహజీవనం నేపథ్యంలో వివాదం.. యువకుడిపై మహిళ యాసిడ్ దాడి
-
రైళ్ల కొత్త టైంటేబుల్ విడుదల