Andhra News: ఒంగోలు రిమ్స్ వద్ద తెదేపా ఆందోళన... ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు
రేపల్లె అత్యాచార బాధితురాలిని మెరుగైన వైద్యం పోలీసులు ఒంగోలు రిమ్స్కు తరలించారు.
ఒంగోలు: రేపల్లె అత్యాచార బాధితురాలిని మెరుగైన వైద్యం పోలీసులు ఒంగోలు రిమ్స్కు తరలించారు. రిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించేందుకు తెదేపా కొండెపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, యర్రగొండపాలెం పార్టీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు, మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు తెదేపా నేతలు రిమ్స్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు వారిని ఆసుపత్రిలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో తెదేపా శ్రేణులు గేటు వద్ద ఆందోళనకు దిగారు. రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు 2గంటల పాటు నిరసన కొనసాగింది. మంత్రి విడదల రజనీ, కలెక్టర్ దినేష్కుమార్ రిమ్స్కు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో పోలీసులకు, తెదేపా నాయకులకు మధ్య తోపులాట జరిగింది. తెదేపా ఎమ్మెల్యే స్వామిని బలవంతంగా అదుపులోకి తీసుకుని ఒంగోలు పోలీసు స్టేషన్కు తరలించారు. తోపులాటలో ఎమ్మెల్యే కాలికి స్వల్ప గాయమైంది. ఎమ్మెల్యేను పోలీసులు తీసుకెళ్తుండగా మహిళలు పోలీసు వాహనానికి అడ్డుపడ్డారు. దాదాపు 100మంది పోలీసులు అక్కడికి చేరుకుని తెదేపా నేతలను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. గేట్లన్నీ మూసివేయడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులతో పాటు, సిబ్బంది ఇబ్బంది పడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు