AP PRC: ఏపీ వ్యాప్తంగా ఉపాధ్యాయుల ఉద్యమబాట
పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఏపీ వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.
అమరావతి: పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఏపీ వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. విజయవాడలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపిన ఉపాధ్యాయులు.. కొత్త పీఆర్సీ వల్ల తమకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఆర్ఏ కనీస శ్లాబు 12శాతానికి పైగా ఉండాలని డిమాండ్ చేశారు. దశలవారీ పోరాటాలకు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు.
భవిష్యత్లో నమ్మే పరిస్థితి లేదు: ఉపాధ్యాయులు
ఫిట్మెంట్ 27శాతం ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. సీపీఎస్ రద్దుకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. ఇవాళ్టి నుంచి శుక్రవారం వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న ఉపాధ్యాయులు.. శుక్రవారం కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు. పీఆర్సీ జీవోల వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ‘చలో విజయవాడ’ని ఉపాధ్యాయులు దిగ్విజయం చేశారని గుర్తు చేశారు. విజయవాడ, విశాఖలో అద్దెలు అధికంగా ఉన్నాయని చెప్పారు. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నాయకులు భవిష్యత్లో ఉద్యమాలు చేస్తే తాము నమ్మే పరిస్థితి లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
మరోవైపు కలెక్టరేట్ల వద్ద నిరసనలకు ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది ఐకాస పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల కాంట్రాక్టు ఉద్యోగ నాయకులను గృహనిర్బంధం చేశారు. నాయకుల గృహనిర్బంధాలను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఖండించారు.
విశాఖలో..
విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు దిగారు. కార్మికుల ఆందోళనల నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసుల తీరు సరిగా లేదంటూ సీఐటీయూ నేతలు మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ