
Hyderabad : హైదరాబాద్లో 15 వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో మూసీ, దాని ఉపనది ఈసాపై వంతెనల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. రూ.545 కోట్ల వ్యయంతో 15 వంతెనలు నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. వంతెనల నిర్మాణం కోసం 50శాతం హెచ్ఎండీఏ నిధులను వినియోగించగా..మరో 50 శాతం నిధులను రుణాల ద్వారా జీహెచ్ఎంసీ సమకూర్చుకోనుంది. ఈ మేరకు వంతెనల నిర్మాణానికి పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వంతెనల నిర్మాణం చేపట్టనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.