KCR: ఉమ్మడి ప్రాజెక్టులనే బోర్డు పరిధిలో ఉంచాలి: సీఎం కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శనివారం కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో భేటీ అయ్యారు.

Updated : 25 Sep 2021 16:13 IST

కేంద్ర మంత్రి షెకావత్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

న్యూదిల్లీ: దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ .. కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల మహబూబ్‌నగర్‌ జిల్లాకు జరుగుతున్న నష్టం, కృష్ణా జలాల అంశంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశాలపై చర్చించారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడంతో పాటు, నీటి కేటాయింపులు జరపాలని కేంద్ర మంత్రిని కోరినట్టు తెలుస్తోంది. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు తేదీ వాయిదాను మరోసారి షెకావత్‌ వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య సంయుక్తంగా ఉన్న ప్రాజెక్టులనే నోటిఫికేషన్‌ పరిధిలోకి తీసుకురావాలని సీఎం కోరినట్టు తెలుస్తోంది. సాయంత్రం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో భేటీకానున్న సీఎం కేసీఆర్‌.. ధాన్యం కొనుగోళ్లపై చర్చిస్తారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో జరిగే వామపక్షతీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని