CM KCR: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతిచెందిన వరంగల్‌ జిల్లాకు చెందిన దామెర రాకేశ్‌ మృతిపట్ల సంతాపం తెలిపారు.

Updated : 17 Jun 2022 23:36 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతిచెందిన వరంగల్‌ జిల్లాకు చెందిన దామెర రాకేశ్‌ మృతిపట్ల సంతాపం తెలిపారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రాకేశ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. రాకేశ్‌ కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. కేంద్రం తప్పుడు విధానాల వల్ల రాకేశ్‌ మృతచెందాడని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డలను ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని