ఉత్తరాఖండ్ ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి
ఉత్తరాఖండ్లో మంచు చరియలు విరిగిపడి వరద ఉప్పొంగడంతో 150 మంది గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...
హైదరాబాద్: ఉత్తరాఖండ్లో మంచు చరియలు విరిగిపడి వరద ఉప్పొంగడంతో సుమారు వంద మందికి పైగా గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాన్ని దురదృష్టకర సంఘటనగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు క్షేమంగా బయటపడాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఉత్తరాఖండ్లోన చమోలీ జిల్లా జోషిమఠ్ వద్ద మంచు చరియలు విరిగి పడడంతో గంగానది ఉపనది అయిన ధౌలిగంగా ఒక్కసారిగా ఉప్పొగింది. దీంతో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగి సమీప ప్రాంతాలను ముంచెత్తింది. దీంతో తపోవన్ వద్ద నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్టు ధ్వంసమైంది. దీంతో ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు, స్థానికులు సుమారు వంద మందికి పైగా గల్లంతయ్యారు. దీంతో వెంటనే ఐటీబీపీ జవాన్లు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టి పలువురిని కాపాడారు. ఇప్పటి వరకు 10 మంది మృతదేహాలు లభించాయి. సహాయక చర్యలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు.
ఇవీ చదవండి..
ఉత్తరాఖండ్లో జలప్రళయం
16 మందిని కాపాడిన ఐటీబీపీ: వీడియో వైరల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి