Telangana News: తెలంగాణలో కొత్తగా 3,590 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 95,355 నమూనాలను పరీక్షించగా 3,590 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల

Published : 29 Jan 2022 19:34 IST

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 95,355 నమూనాలను పరీక్షించగా 3,590 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,58,566కి పెరిగింది. తాజాగా మహమ్మారి బారిన పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 3,555 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 7,14,034 మంది కరోనా నుంచి బయటపడినట్లు ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. మరో 40,447 మంది చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 94.13 శాతంగా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 1160 మందికి పాజిటివ్‌గా తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని