TS Corona: తెలంగాణలో కొత్తగా 434 కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 23,979 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా

Published : 26 Jun 2022 21:21 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 23,979 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 434 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది. నిన్న కరోనా బారి నుంచి 285 బాధితులు పూర్తిగా కోలకున్నారు. రికవరీ రేటు 99.01 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,762 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజా కేసుల్లో హైదరాబాద్‌లోనే అత్యధికంగా 343 నమోదయ్యాయి. రంగారెడ్డిలో 34, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 25,  సంగారెడ్డిలో 9, ఖమ్మంలో 7 కేసులు వెలుగుచూశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని