Ts News: తెలంగాణలో 93% రికవరీ రేటు 

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,982 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,74,026కి చేరింది. తాజాగా ఈ మహమ్మారి..

Updated : 29 May 2021 20:41 IST

హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,982 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,74,026కి చేరింది. తాజాగా ఈ మహమ్మారి కారణంగా 21 మంది మృత్యువాత పడగా.. మృతుల సంఖ్య 3,247కి చేరినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ తెలిపింది. 1,00,677 పరీక్షలు చేసినట్లు పేర్కొంది. 36,917 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 436 కేసులు వెలుగుచూశాయి. 

మరోవైపు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగానే ఉంటోంది. తాజాగా 3,837 మంది కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. దేశంలో 90.8 శాతం రికవరీ రేటు ఉండగా... రాష్ట్రంలో ఈ రేటు 93 శాతంగా ఉన్నట్లు తెలిపింది. మరణాల రేటు సైతం జాతీయ సగటు (1.2శాతం)తో పోలిస్తే రాష్ట్రం మిన్నగా ఉందని (0.56శాతం) పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని