Telangana News: ప్రకాశం బ్యారేజీ దిగువన ఆనకట్టల నిర్మాణంపై తెలంగాణ అభ్యంతరం
ఆంధ్రప్రదేశ్పై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరోమారు ఫిర్యాదు చేసింది. కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ దిగువన రెండు ఆనకట్టల నిర్మాణానికి ప్రతిపాదనలపై
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్పై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరోమారు ఫిర్యాదు చేసింది. కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ దిగువన రెండు ఆనకట్టల నిర్మాణానికి ప్రతిపాదనలపై అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రెండు లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్, కృష్ణాబోర్డు అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి వీల్లేదని లేఖలో పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ దిగువున రెండు ఆనకట్టల నిర్మాణాలు చేపట్టడం సరికాదని అభ్యంతరం తెలిపారు. దీన్ని నిలువరించాలని కేఆర్ఎంబీని కోరారు.
కృష్ణా జలాలపై ఆధారపడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంప్డ్ స్టోరేజీ స్కీమ్లను చేపడుతోందన్నారు. తెలంగాణ పరిధిలోని కృష్ణా బేసిన్లో తాగునీటి కొరత ఉన్న నేపథ్యంలో జాతీయ జలవిధానం ప్రకారం మొదట తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తాగునీటికోసం కాకుండా కృష్ణా బేసిన్ వెలుపలకు పంప్డ్ స్టోరేజ్ కోసం విద్యుత్ ఉత్పత్తి లేదా ఇతర అవసరాలకోసం నీటిని తరలించడం సరికాదన్నారు. కేంద్ర జలసంఘం, కృష్ణా బోర్డు అనుమతిలేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న అన్ని పంప్డ్ స్టోరేజీ స్కీమ్లను మరోమారు పరిశీలించాలని కేఆర్ఎంబీని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!