Telangana News: తెలంగాణలో కొత్తగా మరో 13 మండలాలు.. తుది నోటిఫికేషన్‌ జారీ

తెలంగాణలో మరికొన్ని కొత్త మండలాలు ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. కొత్తగా మరో 13 మండలాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది...

Published : 27 Sep 2022 01:46 IST

హైదరాబాద్‌: తెలంగాణలో మరికొన్ని కొత్త మండలాలు ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. కొత్తగా మరో 13 మండలాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జులై 23న ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలు ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జులైలో ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది.

జిల్లాల వారీగా కొత్త మండలాలు ఇవే..

* జగిత్యాల జిల్లా - ఎండపల్లి, భీమారం

* సంగారెడ్డి జిల్లా - నిజాంపేట్‌

* నల్గొండ జిల్లా - గట్టుప్పల్‌

* మహబూబాబాద్‌ జిల్లా - సీరోలు, ఇనుగుర్తి

* సిద్దిపేట జిల్లా - అక్బర్‌పేట-భూంపల్లి, కుకునూరుపల్లి

కామారెడ్డి జిల్లా - డోంగ్లి

* నిజామాబాద్ జిల్లా - ఆలూర్‌, డొంకేశ్వర్‌, సాలూరా

* మహబూబర్‌నగర్‌ జిల్లా - కౌకుంట్ల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని