KRMB: టెండర్ ప్రక్రియ కొనసాగించకుండా ఏపీని నిలువరించాలి: కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ
ఆంధ్రప్రదేశ్లోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్ ప్రక్రియ చేపట్టడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. టెండర్...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్ ప్రక్రియ చేపట్టడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. టెండర్ ప్రక్రియ కొనసాగించకుండా ఏపీని నిలువరించాలనని కోరుతూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు.
‘‘ట్రైబ్యునల్, విభజన చట్టానికి విరుద్ధంగా విస్తరణ పనులు చేపట్టడంపై గతంలోనే పలుమార్లు ఫిర్యాదు చేశాం. నిప్పులవాగు ఎస్కేప్ కెనాల్ను గెజిట్ నోటిఫికేషన్ రెండో షెడ్యూల్లో చేర్చాలని కూడా కోరాం. అనుమతుల్లేకుండా బనకచర్ల వద్ద ఎస్కేప్ రెగ్యులేటర్ నిర్మాణాన్ని బోర్డు దృష్టికి తీసుకురావడంతో పాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్ కేవలం 34 టీఎంసీల నీటిని మాత్రమే తీసుకునేలా చూడాలని గతంలోనే విజ్ఞప్తి చేశాం. అయినప్పటికీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, సంబంధిత పనులకు ఈ మే 6వ తేదీన ఏపీ ప్రభుత్వం పలు టెండర్ నోటిఫికేషన్లు జారీ చేసింది. మే 23 వరకు టెండర్ల దాఖలుకు గడువు ఇచ్చింది.
నీరు తక్కువగా ఉన్న కృష్ణా బేసిన్ నుంచి పెద్ద మొత్తంలో జలాలను ఇతర బేసిన్లకు తరలించడం తీవ్ర ప్రభావం చూపుతుంది. నదీ వ్యవస్థతో పాటు జంతుజాలం, వన్యప్రాణులు, పర్యావరణం, మత్స్య సంపదపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. తద్వారా సహజ వనరులను పొందకుండా బేసిన్లోని ప్రజల హక్కులను కాలరాసినట్లు అవుతుంది. శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ 34 టీఎంసీలకు మించి తీసుకోకుండా చూడాలని పదేపదే బోర్డును కోరుతున్నాం. ప్రతిపాదిత విస్తరణ పనులు శ్రీశైలం నుంచి సాగర్ వరకు తెలంగాణ ప్రాంతంలోని కృష్ణా బేసిన్పై తీవ్ర ప్రభావం చూపుతాయి. 2014 జూన్ తర్వాత చేపట్టే ఏ ప్రాజెక్టు అయిన విభజన చట్టానికి లోబడే జరగేలా చూడాలి. వీటన్నింటి నేపథ్యంలో పోతిరెడ్డిపాడు విస్తరణ, సంబంధిత పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను ఏపీ కొనసాగించకుండా నిలువరించాలి’’ అని ఈఎన్సీ లేఖలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!