
Published : 02 Apr 2021 02:01 IST
దుకాణాల సమయం కుదింపుపై సీఎస్ స్పష్టత
హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల నుంచి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో పుకార్లు జోరందుకున్నాయి. రాత్రివేళ దుకాణాల సమయాన్ని కుదిస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు దర్శనమిచ్చాయి. దీంతో ఈ పుకార్లపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. సామాజిక మాధ్యమాల్లోని జీవో కాపీ నకిలీదని సీఎస్ సోమేశ్ కుమార్ చెప్పారు. రాత్రివేళ దుకాణాలు మూసివేత వార్త తప్పుడు ప్రచారమని ఆయన పేర్కొన్నారు. దుకాణాలు సాయంత్రం 6 గంటలకు మూసివేయాలనేది నిజం కాదన్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ ఉండదని సీఎస్ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి
Tags :