ST Reservations: తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్ల శాతం పెంపు.. తక్షణమే అమల్లోకి
తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఈ రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.
హైదరాబాద్: తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఈ రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా ఉత్తర్వులు విడుదల చేశారు. గిరిజన రిజర్వేషన్లు పెంచుతామని ఇటీవలే ఆదివాసి, బంజారా సమ్మేళనంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు పెంచుతూ 2016లోనే బిల్లును ప్రవేశపెట్టింది. దీంతో ఉభయ సభలు ఆమోదం తెలిపాయని ప్రభుత్వం పేర్కొంది. రిజర్వేషన్ల పెంపుపై పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశామని తెలిపింది. ఎస్టీలు నష్టపోకుండా రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం పేర్కొంది. ప్రత్యేక పరిస్థితుల్లో ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు