Telangana News: ‘ఎమ్మెల్యేలకు ఎర కేసు’ స్టే ఎత్తివేయండి.. హైకోర్టును కోరిన రాష్ట్ర ప్రభుత్వం
ఎమ్మెల్యేల ఎర కేసులో భాజపా నిరాధార ఆరోపణలతో పిటిషన్ దాఖలు చేసిందని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. భాజపా పిటిషన్ విచారణలో భాగంగా కేసు దర్యాప్తుపై విధించిన స్టే ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
హైదరాబాద్: ఎమ్మెల్యేల ఎర కేసులో భాజపా నిరాధార ఆరోపణలతో పిటిషన్ దాఖలు చేసిందని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. భాజపా పిటిషన్ విచారణలో భాగంగా కేసు దర్యాప్తుపై విధించిన స్టే ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి తరఫున రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ పిటిషన్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తు పూర్తి నిష్పక్షపాతంగా జరుగుతుందని ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. కేసు నమోదై 24 గంటలు గడవక ముందే.. దర్యాప్తు ఏకపక్షంగా జరుగుతోందంటూ భాజపా పిటిషన్ వేసిందని న్యాయస్థానానికి తెలిపింది. గత నెల 26న కేసు నమోదు కాగా.. పంచనామాపై 27న సంతకాలు చేశారంటూ హైకోర్టు వ్యక్తం చేసిన అనుమానంపై వివరణ ఇచ్చింది. మధ్యవర్తులు సంతకం చేసిన తర్వాత తేదీ రాయడంలో పొరపాటు జరిగిందని హైకోర్టుకు తెలిపింది. పంచనామా అనేది స్వాధీనం చేసుకున్న వస్తువులకు సంబంధించిన అంశమని.. భాజపా పిటిషన్పై విచారణలో పంచనామాకు ప్రాధాన్యం అవసరం లేదని పేర్కొంది. కేసు దర్యాప్తులో జాప్యం జరిగితే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉన్నందున.. వెంటనే స్టే ఎత్తివేయాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది.
తెరాస, భాజపా గొడవలో బాధితులమయ్యాం: నిందితులు
మరోవైపు, ఈ కేసులో నిందితులైన రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి నేతృత్వంలోని సిట్కు ఈ కేసును అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ‘‘నలుగురు ఎమ్మెల్యేలను ఇప్పటివరకు విచారించలేదు. సీఎం మార్గదర్శకంలో జరుతున్న దర్యాప్తుపై నమ్మకం లేదు. తెరాస ప్రయోజనాల కోసం తప్పుడు సాక్ష్యాలు సృష్టించే ప్రమాదం ఉంది. తెరాస, భాజపా మధ్య గొడవలో బాధితులమయ్యాం’’ అని పిటిషన్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్