TS News: తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు
తెలంగాణలో 29 మంది ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం బదిలీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో 29 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా రాజీవ్ రతన్ను నియమించారు. పోలీసు అకాడమీ డెరెక్టర్గా సందీప్ శాండిల్య, ఆర్గనైజేషన్, లీగల్ అదనపు డీజీగా శ్రీనివాస్రెడ్డి, రైల్వే అదనపు డీజీగా శివధర్ రెడ్డి, పోలీసు సంక్షేమం, క్రీడల అదనపు డీజీగా అభిలాష బిస్తు, మహిళా భద్రత, షీటీమ్స్ అదనపు డీజీగా షికా గోయల్, టీఎస్ఎస్పీ బెటాలియన్ అదనపు డీజీగా స్వాతి లక్రా, గ్రేహౌండ్స్ ఆక్టోపస్ అదనపు డీజీగా విజయ్కుమార్, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్గా నాగిరెడ్డి, హైదరాబాద్ అదనపు సీపీ (లా అండ్ ఆర్డర్)గా విక్రమ్ సింగ్ మాన్, హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీగా సుధీర్బాబు, మల్టీజోన్-2 ఐజీగా షానవాజ్ ఖాసిం, పోలీసు శిక్షణ ఐజీగా తరుణ్ జోషి, ఐజీ (పర్సనల్)గా కమలాసన్ రెడ్డి, మల్టీజోన్-1 ఐజీగా చంద్రశేఖర్ రెడ్డి, డీఐజీ (పీ అండ్ ఎల్)గా రమేశ్, ఇంటెలిజెన్స్ డీఐజీగా కార్తికేయ, రాజన్న జోన్ డీఐజీగా రమేశ్ నాయుడు, సీఏఆర్ సంయుక్త సీపీగా ఎం.శ్రీనివాసులు, ఐఎస్డబ్ల్యూ డీఐజీగా తఫ్సీర్ ఇక్బాల్, రాచకొండ సంయుక్త సీపీగా గజరావు భూపాల్, యాదాద్రి జోన్ డీఐజీగా రెమా రాజేశ్వరి, జోగులాంబ జోన్ డీఐజీగా ఎల్.ఎస్.చౌహాన్, సైబరాబాద్ ట్రాఫిక్ సంయుక్త సీపీగా నారాయణ నాయక్, హైదరాబాద్ సంయుక్త సీపీ (పరిపాలన)గా పరిమళ, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్పీగా ఆర్.భాస్కరన్ను బదిలీ చేసింది.
హోంగార్డు అదనపు డీజీగా అభిలాష బిస్తు, పోలీసు కంప్యూటర్ సర్వీసెస్ అదనపు డీజీగా శ్రీనివాసరావు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా స్టీఫెన్ రవీంద్ర, నల్గొండ ఎస్పీగా రెమా రాజేశ్వరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.