MLAs Bribery case: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. భాజపా విజ్ఞప్తిని నిరాకరించిన హైకోర్టు
ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. దిల్లీలో ఓ వ్యక్తికి నేరుగా నోటీసులు ఇచ్చేందుకు అక్కడి పోలీసులు అనుమతించడం లేదని సిట్ పిటిషన్ వేసింది.
హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. దిల్లీలో ఓ వ్యక్తికి నేరుగా నోటీసులు ఇచ్చేందుకు అక్కడి పోలీసులు అనుమతించడం లేదని సిట్ పిటిషన్ వేసింది. విచారణకు దిల్లీ పోలీసులు సహకరించడం లేదని పేర్కొంది. ఈ కేసు దర్యాప్తునకు అంతరాయం కలిగించొద్దని దిల్లీ సీపీని ఆదేశించాలని ఉన్నత న్యాయస్థానాన్ని సిట్ కోరింది. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.
మరోవైపు ఈ కేసులో బీఎల్ సంతోష్, శ్రీనివాస్కు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. బీఎల్ సంతోష్, శ్రీనివాస్లకు సిట్ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని భాజపా నేత ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పైనా హైకోర్టు విచారించింది. సిట్ నోటీసులు రద్దు చేయాలన్న భాజపా విజ్ఞప్తిని నిరాకరిస్తూ.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సంతోష్ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!