TS News: దేవర‌యాంజ‌ల్‌ భూముల్లో ఖాళీ చేయించొద్దు

దేవ‌ర‌యాంజ‌ల్ భూముల్లోని స్థానికుల‌ను ఖాళీ చేయించొద్దంటూ హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ భూముల నుంచి ఖాళీ చేయిస్తున్నారంటూ పి.కిష‌న్‌రెడ్డి అనే స్థానికుడు

Updated : 27 May 2021 15:20 IST

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైద‌రాబాద్‌: దేవ‌ర‌యాంజ‌ల్ భూముల్లోని స్థానికుల‌ను ఖాళీ చేయించొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది.  భూముల నుంచి ఖాళీ చేయిస్తున్నారంటూ పి.కిష‌న్‌రెడ్డి అనే స్థానికుడు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. షెడ్లు కూల్చేస్తామ‌ని, ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్నార‌ని ఆయన పిటిష‌న్‌లో పేర్కొన్నారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన ఉన్నత న్యాయ‌స్థానం ఈ మేర‌కు ఉత్త‌ర్వులు ఇచ్చింది. దీనికి ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇస్తూ.. విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని, ఖాళీ చేయించ‌డం లేద‌ని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని