Ts HighCourt: మియాపూర్ భూముల కుంభకోణం.. ఎమ్మెల్యే రఘునందన్ రావు పిటిషన్ కొట్టివేత
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మియాపూర్ భూముల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్న భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నందున సీబీఐ విచారణ అవసరం లేదంటూ రఘునందన్...
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మియాపూర్ భూముల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్న భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నందున సీబీఐ విచారణ అవసరం లేదంటూ రఘునందన్ పిల్పై విచారణ ముగించింది. మియాపూర్లోని సర్వే నెంబరు 20, 28, 100, 101లోని 692 ఎకరాల ప్రభుత్వ భూమిని ట్రినిటీ ఇన్ ఫ్రా తరఫున పీఎస్ పార్థసారథి, సువిశాల్ పవర్ జనరేషన్ లిమిటెడ్కు రిజిస్ట్రేషన్ చేశారని అభియోగం. రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేసి సబ్ రిజిస్ట్రార్ ఆర్.శ్రీనివాసరావు, పార్థసారథి సహా 24 మందిపై అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో కీలక వ్యక్తులు ఉన్నందున సీబీఐ విచారణకు అప్పగించాలంటూ రఘునందన్ రావు 2017లో పిల్ దాఖలు చేశారు.
కేసు దర్యాప్తు ఏ దశలో ఉందో తెలపాలని ఇటీవల హైకోర్టు ఆదేశించడంతో మియాపూర్ ఏసీపీ కృష్ణప్రసాద్ నివేదిక సమర్పించారు. పార్థసారథి సహా 24 మందిపై 2017, 2018లో అభియోగపత్రాలు దాఖలు చేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు. పార్థసారథి, పీవీఎస్ శర్మ, ఇంద్రాణి ప్రసాద్, మహిత ప్రసాద్, సునితా ప్రసాద్, పి.వెంకట రాజీవ్, మహమ్మద్ ఇంతియాజ్ పాషా, పీవీఆర్ మూర్తి, ఆర్.సుబ్రహ్మణ్యం సహా 11 మందిపై 2019, 2021లో హైకోర్టు కేసు కొట్టివేసిందని నివేదికలో తెలిపారు. అయితే దర్యాప్తు నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించిన తర్వాత... హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీలు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. గత నెల 10న జీవోలు జారీ అయ్యాయని.. సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేయాల్సి ఉందని నివేదికలో పేర్కొన్నారు. ఏసీపీ నివేదికను పరిగణనలోకి తీసుకున్న సీజే జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టినందున సీబీఐ దర్యాప్తు అవసరం లేదని తెలిపింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే చట్టప్రకారం తగిన సంస్థలను ఆశ్రయించవచ్చునని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..