PFI: పీఎఫ్ఐ దాడులకు అవకాశం.. అప్రమత్తమైన తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకర్తలు దాడులు చేసే ప్రమాదముందని తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్తోపాటు హిందూ ధార్మిక సంస్థలకు చెందిన ప్రతినిధులే లక్ష్యంగా దాడులు జరిగొచ్చని.. ఈ మేరకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకర్తలు దాడులు చేసే ప్రమాదముందని తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్తోపాటు హిందూ ధార్మిక సంస్థలకు చెందిన ప్రతినిధులే లక్ష్యంగా దాడులు జరిగొచ్చని.. ఈ మేరకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు ఇంటెలిజెన్స్ అధికారులు సూచించారు. కేరళ, తమిళనాడులో పీఎఫ్ఐ కార్యకర్తలు పన్నిన కుట్రను అక్కడి పోలీసులు భగ్నం చేశారు. ఆ మేరకు తెలంగాణలోనూ పీఎఫ్ఐ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ను టార్గెట్ చేసుకొని దాడులు చేసే ప్రమాదం ఉందని నిఘా వర్గం దర్యాప్తులో తేలింది. తెలంగాణలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ అధికారులు నిఘా పెట్టాలని.. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని నిఘా అధికారులు సూచించారు.
గత నెల ఎన్ఐఏ అధికారులు దేశ వ్యాప్తంగా పలు చోట్ల దాడులు చేసి పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేశారు. నగరంలోని పాతబస్తీలో ఉన్న పీఎఫ్ఐ కార్యాలయాన్ని సీజ్ చేశారు. విదేశాల నుంచి నిధులు అందుకుంటున్న పీఎఫ్ఐ ప్రతినిధులు.. మత ఘర్షణలు సృష్టించేందుకు వాటిని వినియోగిస్తున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా పలువురు పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారులు వాళ్ల నుంచి కీలక సమాచారం సేకరించారు. పీఎఫ్ఐని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీకారంగా పీఎఫ్ఐ కార్యకర్తలు దాడులకు దిగే ప్రమాదముందని ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు సైతం రాష్ట్రాలను అప్రమత్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ