TS news: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాలను ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. పరీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మందిని  ఉత్తీర్ణులుగా ప్రకటించింది. ఇందులో  2,28,754

Updated : 28 Jun 2021 22:18 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మందిని ఉత్తీర్ణులుగా ప్రకటించారు.. ఇందులో 2,28,754 మంది బాలికలు, 2,22,831 మంది బాలురు ఉన్నారు. 1,04,886 మంది విద్యార్థులు గ్రేడ్‌ -ఏ  61,887 మంది గ్రేడ్‌ -బి  సాధించగా.. 1,08,093 మందికి సీ గ్రేడ్‌ వచ్చింది.ఫలితాలను http://tsbie.cgg.gov.inhttp://examresults.ts.nic.in, http://results.cgg.gov.in వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. మార్కుల మెమోలో తప్పులుంటే ఫిర్యాదు చేసేందుకు ఇంటర్‌బోర్డు అవకాశం కల్పించింది. టోల్ ఫ్రీ నెంబర్‌ 040 24600110కు ఫోన్‌ చేసి చెప్పాలని సూచించింది. కరోనా విస్తృతి నేపథ్యంలో ఇంటర్‌ పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఫలితాల వెల్లడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు ఖరారు చేసింది.

ఆయా సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించారు. ఇంటర్‌ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు ఇచ్చారు. గతంలో ఫెయిల్‌ అయిన సబ్జెక్టులకు 35 శాతం మార్కులను, బ్యాక్‌లాగ్స్‌ ఉంటే ఆ సబ్జెక్టులకు రెండో ఏడాది 35 మార్కులను కేటాయించారు. ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35 శాతం మార్కులు ఇవ్వనున్నట్లు మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు మెరుగయ్యాక ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది.

సెట్‌ పరీక్షల్లో మార్పులు లేవు: సబిత

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న సెట్‌ పరీక్షల్లో ఎలాంటి మార్పులు లేవని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు జులైలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఆన్‌లోనే బోధించాలన్నారు. దూరదర్శన్‌ యాదగిరి, టీశాట్‌ ద్వారా తరగతులు నిర్వహిస్తామన్నారు. దూరదర్శన్‌ యూట్యూబ్‌ ఛానెల్‌లోనూ పాఠాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రైవేటు పాఠశాలలు ట్యూషన్‌ ఫీజులు నెలవారీగా వసూలు చేయాలని ఆదేశించారు. 50 శాతం మంది ఉపాధ్యాయులు హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని