TS Corona తెలంగాణలో కొత్తగా 582 కేసులు..3 మరణాలు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,07,329 నమూనాలను పరీక్షించగా.. 582 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటివరకు నమోదైన

Updated : 05 Aug 2021 20:17 IST

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,07,329 నమూనాలను పరీక్షించగా.. 582 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,47,811కు చేరింది. తాజాగా కరోనా మహమ్మారికి ముగ్గురు బలయ్యారు.దీంతో మృతుల సంఖ్య 3,817కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,744 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రికవరీ రేటు 98.06 శాతం కాగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో  83 కేసులు నమోదైనట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు