Telangana News: ప్రజలు సహకరిస్తే మూడో దశ నుంచి బయటపడతాం: హరీశ్రావు
కరోనా మహమ్మారి నుంచి త్వరలోనే బయట పడతామని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆశాభావం వ్యక్తం చేశారు.
సత్తుపల్లి: కరోనా మహమ్మారి నుంచి త్వరలోనే బయట పడతామని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గిందని చెప్పారు. ప్రజలు సహకరిస్తే మూడో దశ నుంచి బయటపడతామన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రూ.34 కోట్లతో నిర్మించనున్న వంద పడకల ఆస్పత్రికి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘సత్తుపల్లిలో రూ.1.25కోట్లతో డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేశాం. హైదరాబాద్ తర్వాత ఖమ్మంలోనే క్యాథ్ల్యాబ్ పెట్టాం. కల్లూరు, పెనుబల్లి ఆస్పత్రులకు నూతన భవనాలు నిర్మిస్తాం. కేసీఆర్ కిట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 52శాతానికి పెరిగాయి. సంక్షేమానికి చిరునామా తెరాస ప్రభుత్వం, సీఎం కేసీఆర్’’ అని హరీశ్రావు చెప్పారు. కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు.
భాజపా అబద్ధాల ప్రచారాన్ని నమ్మొద్దని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ పథకాలను కేంద్రమంత్రులు ప్రశంసించారని గుర్తు చేశారు. భాజపా నేతలేమో గల్లీలో విమర్శలు చేస్తారని పేర్కొన్నారు. రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నది భాజపానేనని వ్యాఖ్యానించారు. గిరిజన వర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకివ్వరని ప్రశ్నించారు. ఐటీఐఆర్ రద్దు చేసి కోచ్ ఫ్యాక్టరీని ఎత్తుకుపోయారని విమర్శించారు. మేం ఇప్పటికే 1, 32, 899 ఉద్యోగాలిచ్చామని, మరో 50 వేలు లేదా 60 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు. కేంద్రంలో ఖాళీగా ఉ న్న 15.62 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 2 కోట్ల మందికి ఉద్యోగాలిస్తామన్న మోదీ ఎన్ని ఇచ్చారని హరీశ్ ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థలను అమ్ముతూ ఉద్యోగాలను పోగొట్టారని విమర్శించారు. బ్యాంకులు లూటీ అయి, ప్రభుత్వ రంగం కుదేలయ్యిందని చెప్పారు. ఐఏఎస్లను ఇష్టం వచ్చినట్లు తీసుకెళ్తారా? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్